బాలికకు న్యాయం జరగాలి.. సెల్‌టవర్ ఎక్కిన యువకుడు

by  |
బాలికకు న్యాయం జరగాలి.. సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ.. ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో జరిగింది. నసురుల్లాబాద్ మండలంలోని లింగంపల్లి తండాకు చెందిన మోహన్ సింగరేణి కాలనీలో జరిగిన హత్యాచారంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే బాలికకు న్యాయం జరగాలి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేశాడు. సుమారు గంట పాటు సెల్ టవర్ మీద హల్‌చల్ సృష్టించాడు. అధికారులు సర్ది చెప్పడంతో ఎట్టకేలకు కిందకు దిగాడు.



Next Story