- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: సైదాబాద్లోని సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ.. ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో జరిగింది. నసురుల్లాబాద్ మండలంలోని లింగంపల్లి తండాకు చెందిన మోహన్ సింగరేణి కాలనీలో జరిగిన హత్యాచారంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే బాలికకు న్యాయం జరగాలి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేశాడు. సుమారు గంట పాటు సెల్ టవర్ మీద హల్చల్ సృష్టించాడు. అధికారులు సర్ది చెప్పడంతో ఎట్టకేలకు కిందకు దిగాడు.
Next Story