- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువరైతు మెడకు అప్పుల ఉచ్చు.. పత్తి చేనులోనే..
by Chintha Aamani |
<p>దిశ: బోథ్ (బజార్ హత్నూర్) : మండలంలోని సోనాల గ్రామానికి చెందిన యువ రైతు శశిధర్(28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు శశిధర్ గత ఏడాది తనకున్న నాలుగు ఎకరాలు భూమితోపాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని 12 ఎకరాల్లో సోయా, పత్తి సాగు చేశాడు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకి దాదాపు మూడు లక్షల నష్టం వచ్చింది. మళ్లీ ఈ ఏడాది […]</p>

X
దిశ: బోథ్ (బజార్ హత్నూర్) : మండలంలోని సోనాల గ్రామానికి చెందిన యువ రైతు శశిధర్(28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు శశిధర్ గత ఏడాది తనకున్న నాలుగు ఎకరాలు భూమితోపాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని 12 ఎకరాల్లో సోయా, పత్తి సాగు చేశాడు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకి దాదాపు మూడు లక్షల నష్టం వచ్చింది. మళ్లీ ఈ ఏడాది కూడా సోయా, పత్తి సాగు చేయగా మొత్తం రూ.8లక్షల అప్పులయ్యాయి. మరోవైపు ఈ ఏడాది కురిసిన అకాల వర్షాలతో పంటలు చేతికి రావని మనస్తాపం చెంది మండలంలోని కొల్హారి శివారులోని తన చేనులోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






