ఫోన్ చోరీ.. కొట్టి చంపేశారు

by  |
ఫోన్ చోరీ.. కొట్టి చంపేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలుడు ఫోన్ దొంగిలించాడని అతడి ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా చితకబాదారు. కొంటే వచ్చే ఫోన్ కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

చిత్తూరు జిల్లా మదన ప్లె మండలం రామపురంలో ఓ బాలుడు సెల్ ఫోన్ అపహరించాడు. ఇది తెలుసుకున్న ఫోన్ యజమాని, మరికొందరు అతడిని పట్టుకుని చితకబాదారు. లేత శరీరంపై పిడి గుద్దుల వర్షం పడడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. కాగా, ఇరు వర్గాల వారు ఈ విషయాన్ని దాచిపేట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాలుడి మృతి వార్త తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సెల్ ఫోన్ కోసం పసివాడి ప్రాణం తీశారని బాధిత కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed