సరదాకు చేసిన పనికి సంకెళ్లు…

by  |
arrest
X

దిశ,వెబ్ డెస్క్: కరోనా కారణంగా మరోసారి తెలంగాణాలో రాత్రిపూట లాక్ డౌన్ అంటూ ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే… సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఏప్రిల్ 1 న తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామని సరదాకి గతేడాది జీవో ను మార్ఫింగ్ చేసి వారికీ పంపడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. సరదా కోసం పోస్ట్ చేశానని సంజీవ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed