అధికారులందరూ అక్కడే ఉండాలి- కలెక్టర్

by  |
pausu
X

దిశ,వికారాబాద్: అధికారులు అందరు హెడ్‌క్వార్టర్‌లోనే ఉండి, అత్యవసర సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. రాబోయే మూడు రోజులు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అందరు అక్కడే ఉండి అత్యవసర సేవలు అందించాలని, నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది ఎవరికి ఎలాంటి సెలవులు లేవని, సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరి, క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల సహాయార్థం జిల్లా కేంద్రంలో 24 గంటలు పనిచేసే విధంగా 6305954956 నెంబర్ తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.

Next Story

Most Viewed