ఇంట్లోనే వ్యాక్సిన్.. వివాదంలో ఎమ్మెల్యే

by  |
YCP MLA Shanavazbasha
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షానవాజ్‌బాషా వివాదంలో చిక్కుకున్నారు. వైద్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎమ్మెల్యేకే కాకుండా ఆయన అనుచరులకు కూడా ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించడంతో ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులే ఆస్పత్రులకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటుంటే ఎమ్మెల్యేలు ఇలా చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నేడు దేశవ్యా్ప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.

Next Story

Most Viewed