‘రామకృష్ణ చీఫ్ గెస్ట్‌లా వ్యవహరించారు’

by  |
‘రామకృష్ణ చీఫ్ గెస్ట్‌లా వ్యవహరించారు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశంలో రామకృష్ణ చీఫ్ గెస్ట్‌లా వ్యవహరించారని విమర్శించారు. అమరావతి భూముల పోరాటాలు, దళితులపై దాడులు విషయాల్లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారల్ మార్క్స్ ఇప్పుడు బతికిఉంటే రామకృష్ణను చూసి ఆత్మహత్య చేసుకునే వాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూ స్వాములకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పార్టీలో పనిచేస్తూ, వారికే మద్దతుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.



Next Story