‘రైతులను మోసం చేసింది చంద్రబాబే’

by  |
‘రైతులను మోసం చేసింది చంద్రబాబే’
X

దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ ఎగ్జిట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత పార్థసారధి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. గత ఎన్నికల ముందు ఎంతో మంది కాంట్రాక్టర్లను పిలిచి వచ్చే తమ ప్రభుత్వం అంటూ కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు.

ఇక రాజధాని అభివృద్ధికి చంద్రబాబు రూ. 52 వేల కోట్లు ఖర్చు చేయలేదని పార్థసారధి చెప్పారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రెండు వేల ఎకరాలు సింగపూర్ కంపెనీకి.. మరో రెండు వేల ఎకరాలు వివిధ సంస్థలకి దానం చేశారని మండిపడ్డారు. రైతులకు మోసం జరిగింది కేవలం చంద్రబాబు మోసాల ద్వారానే అని ఆయన విమర్శించారు. ఏపీని మొత్తం అప్పుల పాలు చేశారంటూ పార్థసారధి మండిపడ్డారు.



Next Story

Most Viewed