- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజును ఈ ఉదయం గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అయినా ఇప్పటివరకు అధికారులు ఆమేరకు చర్యలు తీసుకోకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక ఈ విషయమై వైసీపీ నేత మిథున్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రఘురామకృష్ణరాజు వెనుక చంద్రబాబు ఉన్నాడని, చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామకృష్ణరాజుపనిచేస్తున్నారని మిథున్ రెడ్డి తెలిపారు. ఆదివారం తనను పోలీసులు కొట్టారని మిథున్ రెడ్డి డ్రామాలు ఆడారని, తనకు బెయిల్ రాకపోవడంతోనే ఇటువంటి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రఘురామకృష్ణరాజు ఆకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారన్న మిథున్ రెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన మాటలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు చేయని హడావిడి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారని, కేవలం రమేష్ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణరాజుకు చికిత్స జరగలాండం సరికాదని అన్నారు.