రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం

by  |
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
X

ఏపీలో శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను నాలుగు స్థానాలూ వైసీపీ సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వాని ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లు పోల్ కాగా, అందులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఎన్నికల అధికారులు కొట్టిపారేశారు. అవగాహన లోపంతో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మొదటి ప్రాధాన్యత స్థానంలో పొరపాటున టిక్ మార్క్ పెట్టారు.

Next Story

Most Viewed