రాళ్లు రువ్వుకున్న వైసీపీ వర్గీయులు

by  |
రాళ్లు రువ్వుకున్న వైసీపీ వర్గీయులు
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. బాపులపాడు మండలం కాకులపాడులో శనివారం మధ్యాహ్నం రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకున్న కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

Next Story

Most Viewed