యమహా అక్టోబర్ అమ్మకాల్లో జోరు

by  |
యమహా అక్టోబర్ అమ్మకాల్లో జోరు
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ టూ-వీలర్ సంస్థ యమహా మోటార్ ఇండియా ఈ ఏడాది అక్టోబర్ నెలలో మొత్తం అమ్మకాల్లో 31 శాతం పెరిగి 60,176 యూనిట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 46,082 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత గత నాలుగు నెలలుగా కంపెనీ తన అమ్మకాల్లో వరుస వృద్ధిని నమోదు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన యమహా జులైలో 4.3 శాతం, ఆగష్టులో 14.8 శాతం, సెప్టెంబర్‌లో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. ‘దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ అమ్మకాల డిమాండ్ భారీగా ఉంటుందని ఆశిస్తోంది. ఇప్పటికే దసరాకు మెరుగైన అమ్మకాలను సాధించినట్టు, దీపావళి, క్రిస్మస్ సమయంలో ఇది మరింత మెరుగ్గా ఉంటుందని’ కంపెనీ వెల్లడించింది.

Next Story