ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలి

by  |
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలి
X

దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి జిల్లా ధర్మారంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తేమ శాతంపై అవగాహన కల్పించాలన్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు.

Tags: Nalgonda, crop purchase centres, collector Anita ramachandran, Inspect

Next Story

Most Viewed