- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది అమయకులు మృతిచెందారు. తాజాగా ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెతుతున్నాయి. అభిమానులైతే ఏకంగా అమితాబ్ బచ్చన్ను గుడి కట్టించి మరీ పూజలు చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టార్ రెజ్లర్ జాన్ సీనా కూడా అమితాబ్, అభిషేక్ బచ్చన్ల ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసి సంఘీభావం ప్రకటించారు. గతంలోనూ జాన్ సీనా ఇదే విధంగా అనేక సందర్భాల్లో భారత ప్రముఖుల ఫొటోలు పోస్టు చేస్తూ, భారతదేశంపై తన అభిమానాన్ని ప్రదర్శించేవారు. బాలీవుడ్ అన్నా, హిందీ సినీ స్టార్లన్నా జాన్ సీనాకు వల్లమాలిన అభిమానం. అతడి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఎక్కువగా వారి ఫొటోలే దర్శనమిస్తాయి.