దోహాలో మళ్లీ US-ఇరాన్ చర్చలు!

by velandi.Saikiran |

ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

దోహాలో మళ్లీ US-ఇరాన్ చర్చలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. డీల్ కుదుర్చుకొని ఆపై మళ్ళీ పరస్పర దాడులు చేసుకుంటున్న అమెరికా, ఇరాన్ దేశాలు ఇప్పుడు శాంతించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఖతర్ లో జరిగిన సమావేశంలో కాల్పులు నిలిపివేసేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు యాక్సియాస్ సంస్థ అధికారిగా ప్రకటన చేసింది. ఇక ఈ వారంలోనే ఆ దేశ రాజధాని దోహాలు మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హర్మూజ్ లో నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు అని ఇరుపక్షాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక దేశాల నౌకలు ఈ జలసంధి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇక దోహా వేదికగా శాంతి చర్చలు సఫలం అవుతే.. యుద్ధానికి ఎండ్ కార్డు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

Next Story