- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరువు నష్టం దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్ వార్నింగ్
ప్రముఖ మీడియా సంస్థ బీబీసికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మీడియా సంస్థ బీబీసికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగం మార్చినందుకు ఆ సంస్థపై 5 బిలియన్ డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ న్యాయబృందం సదరు మీడియా సంస్థకు లేఖ రాసింది. దీంతో క్షమాపణలు చెప్పి బీబీసీ ఐదు బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు నిరాకరించింది.
బీబీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ మరోసారి ట్రంప్ ఆ సంస్థపై దావా తప్పదని హెచ్చరించారు. వచ్చే వారం బీబీసీపై 1 బిలియన్ డాలర్ల నుండి బిలియన్ డాలర్ల వరకు కోర్టులో దావా వేస్తున్నట్టు పేర్కొన్నారు. దీని గురించి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో చర్చిస్తానని వెల్లడించారు. ఇక ఇప్పటికే ట్రంప్ రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేశారు. అయినప్పటికీ ట్రంప్ వదిలిపెట్టలేదు. తన ప్రసంగం మార్చినందుకు దావా వేస్తానని మరోసారి హెచ్చరించారు.






