మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్ లో లక్ష మంది ఉపాధి గల్లంతు!

by velandi.Saikiran |

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ( Modi Govt)... పాకిస్తాన్ కు (Pakisthan) వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో... శత్ర

మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్ లో లక్ష మంది ఉపాధి గల్లంతు!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ( Modi Govt)... పాకిస్తాన్ కు (Pakisthan) వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో... శత్రు దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సింధు జలాలను ( Sindhu) ఆపేసిన మోడీ ( Modi) ప్రభుత్వం.. పలు యూట్యూబ్ ఛానల్స్ పై ( YouTube channels) కూడా ఆంక్షలు విధించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు ( Terrorists) ఇండియాపై దౌర్జన్యానికి పాల్పడిన నేపథ్యంలో... మోడీ ప్రభుత్వం చాలా చురుగ్గా ముందుకు.. వెళ్తోంది.

పాకిస్తాన్ దేశాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీసేలా... వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 93 వేలకు పైగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ పై ఆంక్షలు విధించింది. దీంతో... 93 వేలకు పైగా మంది అంటే దాదాపు లక్ష మంది ఉపాధి కోల్పోయారు. ఇండియాలో వాళ్ల యూట్యూబ్ ఛానల్స్ నడిస్తేనే... ఎక్కువ డబ్బులు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పైనే మోడీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.

దీంతో సోషల్ మీడియాను నమ్ముకొని బతుకుతున్న పాకిస్తాన్ జనాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ మాలిక్.. షాహిద్ అఫ్రిది లాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ను కూడా... బ్యాన్ చేసింది మోడీ ప్రభుత్వం. ఇలా ఆర్థిక మూలాలపై కూడా మోడీ ప్రభుత్వం దెబ్బ కొట్టడంతో... పాకిస్తాన్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంతలా చుక్కలు చూపించినా కూడా బార్డర్ లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు చేసే ప్రయత్నాలు వచ్చేస్తుంది. వాళ్లు కాల్పులు చేసిన ఇండియన్ ఆర్మీ మాత్రం తగ్గడం లేదు.

Next Story