Australia లో కాల్పుల కలకలం.. ఇద్దరు అధికారులతో సహా ఆరుగురు మృతి

by Disha Web Desk 12 |
Australia లో కాల్పుల కలకలం.. ఇద్దరు అధికారులతో సహా ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలో పోలీసులు, ఇద్దరు దుండగుల మధ్య కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పులు వైయంబిల్లాలోని గ్రామీణ ఆస్తి వద్ద సంభవించిన ఆరుగురు మృతి చెందారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తప్పిపోయిన వ్యక్తిని వెతికేందుకు వెళ్లిన పోలీసులపై ఇద్దరు వ్యక్తులు భారీ ఆయుధాలతో దాడి చేశారు. దీంతో పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. అలాగే కాల్పుల సమయంలో స్థానికంగా ఉన్న మరో నలుగురు కూడా మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే కాల్పులకు పాల్పడిన వారికి కూడా తీవ్రగాయాయినట్లు తెలిపారు.

Read More....

ఒక దేశం ఇంకొ దేశంపై ఆరోపణలు తప్ప చర్యలు శూన్యం: జైశంకర్


Next Story