కరోనా వైరస్ మనిషి తయారు చేసిందే.. వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 17 |
కరోనా వైరస్ మనిషి తయారు చేసిందే.. వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్ సంచలన వ్యాఖ్యలు
X

వాషింగ్టన్: కరోనా వైరస్ విషయంలో వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు. కొవిడ్-19 వైరస్ మనిషి తయారు చేసిందేనని యూఎస్‌కు చెందిన అండ్రూ హఫ్ పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ద్వారా రెండేళ్ల క్రితం వైరస్ బయటకు వచ్చినట్లు పరిశోధకులు అండ్రూ హఫ్స్ చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా రాసిన 'ది ట్రూత్ ఎబౌట్ వుహాన్' పుస్తకంలో తెలిపారు.


చైనాలోని కరోనావైరస్‌కు యూఎస్ ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించినట్లు ఆరోపణలు చేశారు. చైనా భద్రత లేకుండా కొన్ని ప్రయోగాలు నిర్వహించిందని, ఇదే వుహాన్ ల్యాబ్‌లో లీకేజీకి కారణమని పేర్కొంది. 'విదేశీ ప్రయోగశాలలో సరైన జీవ భద్రత, బయో సెక్యూరిటీ, ప్రమాద నిర్వహణను నిర్ధారించడానికి తగిన నియంత్రణ చర్యలు లేవు. చివరికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో లీకేజీ చోటుచేసుకుంది' అని తన పుస్తకంలో పేర్కొన్నాడు.

గత రెండేళ్లలో అనేక కథనాలు వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రమాదకరమైన బయోటెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి అమెరికా ప్రభుత్వమే కారణమని అండ్రూ ఆరోపించారు.


Next Story