- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎనిమిది గంటలు ముందుగా రైల్వేల్లో రిజర్వేషన్ చార్ట్
రైల్వే రిజర్వేషన్ చార్ట్ లను నాలుగు గంటల ముందుగా కాకుండా ఎనిమిది గంటల ముందుగా సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: రైల్వే రిజర్వేషన్ చార్ట్ లను ఎనిమిది గంటల ముందుగా సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది నాలుగు గంటల ముందుగా ఉంచేవారు. ఇది దూర ప్రాంతాలు, రిమోట్ విలేజ్ నుంచి వచ్చే ప్రయాణికులను ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇది దూర ప్రాంతాల నుండి లేదా ప్రధాన నగరాల శివారు ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి సుదూర రైలు ప్రయాణం చేయాలనుకునే వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వెయిట్ లిస్ట్ నిర్ధారించబడకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇది ఎక్కువ సమయం దొరుకుతుందని అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్
కొత్త అప్గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్ బుకింగ్లను అనుమతిస్తుంది. ప్రస్తుత PRSలో నిమిషానికి 32,000 టిక్కెట్ల బుకింగ్ జరుగుతుండగా ఇది దాదాపు ఐదు రెట్లు పెరుగుతుంది అని తెలిపింది. కొత్త PRS బహుభాషా వినియోగదారుడిగా.. స్నేహపూర్వక బుకింగ్, విచారణ ఇంటర్ఫేస్ను కలిగి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త PRSలో వినియోగదారులు తమ సీటు ఎంపికను సమర్పించి ఛార్జీల క్యాలెండర్ను చూడగలరు. దివ్యాంగులు, విద్యార్థులు రోగులకు ఇది ఇంటిగ్రేటెడ్ సౌకర్యాలను కలిగి ఉందని అధికారులు తెలిపారు. జూలై చివరి నుంచి తత్కాల్ బుకింగ్ల కోసం OTP ఆధారిత ప్రామాణీకరణ జరుగుతుందని పేర్కొంది. తత్కాల్ బుకింగ్ల కోసం ప్రామాణీకరణ విధానాన్ని విస్తృతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆధార్ లేదా వినియోగదారు డిజిలాకర్ ఖాతాలో అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర ధ్రువీకరించదగిన ప్రభుత్వ IDని ఉపయోగించి ప్రామాణీకరణ చేయాలి అని ప్రకటనలో పేర్కొంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. రైల్వేలు దాని వ్యవస్థలను ఆధునీకరించడానికి పౌరులకు మరింత సులువు చేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.






