- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోడీ
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన పీఎం మోడీ. "పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలి.. స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ నిర్ణయం ఎంతో కీలకం" అని ట్వీట్!

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా 107 రోజుల యుద్ధానికి ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం చేసుకున్న ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరతకు దారి తీయడమే కాకుండా, అనేక దేశాలలో అమాయకుల ప్రాణ నష్టానికి కారణమైందని ప్రధాని గుర్తుచేశారు.
ఈ శాంతి ఒప్పందం అమలు కావడం ద్వారా ఆయా ప్రాంతాల్లో తిరిగి శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని భారతదేశం బలంగా ఆశిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన జలమార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి (Freedom of navigation and commerce) ఈ ఒప్పందం పూర్తి భరోసా ఇస్తుందని ఆకాంక్షించారు. మిగిలి ఉన్న ఇతర వివాదాస్పద అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య త్వరలోనే ఫలప్రదమైన చర్చలు జరిగి.. శాశ్వత, సుస్థిర తుది ఒప్పందం దిశగా అడుగులు పడాలని ఎదురుచూస్తున్నట్లు పీఎం మోడీ తన సందేశంలో వెల్లడించారు.






