మా రాష్ట్రం పూర్తిగా అప్రమత్తంగా ఉంది: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by srinivas |
మా రాష్ట్రం పూర్తిగా అప్రమత్తంగా ఉంది: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)లో ఉగ్రశిబిరాలను బాంబు దాడులతో ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ జమ్మూకాశ్మీర్‌లోని పౌరులపై బాంబు దాడులు చేస్తోంది. అయితే భారత్ కూడా అందుకు దీటుగా సమాధానం ఇస్తోంది. సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసేందుకు వచ్చిన 50కి పైగా డ్రోన్స్‌ను భారత సైన్యం ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor)ను కొనసాగుతోంది.


అయితే పాకిస్థాన్ ఆర్మీ చర్యలను యావత్తు దేశం ఖండిస్తోంది. ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, సినిమా హీరోలు, ప్రముఖులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ‘‘ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఉగ్రస్థావరాలు లేకుండా చేసేందుకు ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించారు. అది కొనసాగుతోంది. పాక్ ఆర్మీకి, ఉగ్రవాదులకు మన సాయుధ దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయి. మహారాష్ట్ర పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ప్రజలను సురక్షితంగా ఉంచడం మా బాధ్యత. మనపై పాకిస్తాన్ దాడి చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్ని భారత సాయుధ దళాలు సహించవు.’’ అని ఏక్‌నాథ్ షిండే హెచ్చరించారు.



Next Story