ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలు.. భారత్ తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం

by Ramesh Naini |

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరుకానుంది.

ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలు.. భారత్ తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరుకానుంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీట, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ ఈ కార్యక్రమం కోసం టెహ్రాన్ వెళ్లనున్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ, ఆయనకు బదులుగా ఈ ప్రతినిధి బృందాన్ని భారత్ పంపిస్తోంది. జూలై 4 నుండి 9 వరకు ఇరాన్‌లోని వివిధ నగరాల్లో ఈ అంత్యక్రియల కార్యక్రమాలు జరగనున్నాయి. జూలై 4 నుంచి 5 వరకు టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా కాంప్లెక్స్‌లో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం ఉంచబడుతుంది. జూలై 6 వ తేదీన అధికారిక అంత్యక్రియల ఊరేగింపు జరగనుంది. కార్యక్రమాలు టెహ్రాన్‌లో ప్రారంభమై, ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లో అంతిమ సంస్కారాలతో ముగియనున్నాయి. ఈ అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు, పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

Next Story