భారీ వరదలు.. నలుగురు మృతి, పలువురు గల్లంతు

by Yella Dhawani Reddy |

ఆస్ట్రేలియాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వరదలు.. నలుగురు మృతి, పలువురు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సౌత్‌ వేల్స్‌లో భారీ వరదలు సంభవించి బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో దాదాపు 50,000 మంది వరదల్లో చిక్కుకుపోగా.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు. పలువురు గల్లయినట్లు సమాచారం. రెస్య్కూ టీం సహాయక చర్యలు చేపట్టి 500 మందికి పైగా ప్రజలను రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయని, తాజాగా సంభవించిన వరదలు 1921, 1929లో నమోదైన స్థానిక రికార్డులను అధిగమించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Next Story