ప్యాసింజర్ రైలులో మంటలు: ఐదుగురు మృతి

by Dishanational2 |
ప్యాసింజర్ రైలులో మంటలు: ఐదుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు వెళ్తున్న బెనాపోల్ ఎక్స్ ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు ఫైర్ సర్వీస్ ఆఫీసర్ రక్జీబుల్ హసన్ తెలిపారు. ఈ క్రమంలో అనేక మందిని రక్షించామని అయితే మంటలు త్వరగా వ్యాపించడంతో ఐదుగురు మరణించినట్టు వెల్లడించారు. రైలులో కొంతమంది భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, జనవరి7(ఆదివారం) బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైలు ప్రమాదం జరగడంతో దేశం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అయితే ఎవరో కావాలనే రైలుకు నిప్పు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story