- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం దాదాపుగా పూర్తయిందంటూ ట్రంప్ ప్రకటన.. తగ్గిన ధరలు!
ఇరాన్ పై యుద్ధం దాదాపు పూర్తయిందని వెల్లడించారు ట్రంప్. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రూడాయిల్ ధర దిగివచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ తో భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. ఇరాన్ పై యుద్ధం దాదాపు పూర్తయిందని వెల్లడించారు ట్రంప్. యుద్ధం ముగిసేందుకు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే ఈ యుద్ధం పూర్తి కాబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ లాంటివి ఏవీ లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్ కాల్ లో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రంపు ప్రకటన.. తగ్గిన క్రూడాయిల్ ధర
ఇరాన్ పై యుద్ధం దాదాపు పూర్తయిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రూడాయిల్ ధర దిగివచ్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ 88 డాలర్లకు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే 23% తగ్గినట్టు అని చెబుతున్నారు నిపుణులు. ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ట్రంప్ అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా ఇరాన్ పై దాడులు ప్రారంభం అయినప్పటి నుంచి ఆయిల్ ధరలు 50% పెరిగాయి.






