దారుణం.. విద్యార్థినులపై విష ప్రయోగం

by Disha Web Desk 4 |
దారుణం.. విద్యార్థినులపై విష ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థినులపై విష ప్రయోగం సంచలనం సృష్టించింది. ఇరాన్ లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం జరిగింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టెహ్రాన్ లోని కోమ్ లోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. ఉద్ధేశపూర్వకంగానే ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ పనాహి తెలిపారు. ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ లోని మీడియా సంస్థలు వార్తా కథనాలు తెలిపాయి.

ప్రభుత్వ ప్రతినిధి బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలు కనుగొనడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. ఘటపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించామన్నారు. కాగా ఇటీవల ఇరాన్ లో వస్త్రాధారణ విషయమై అరెస్ట్ చేసిన 22 ఏళ్ల మహ్సా అమిని డిసెంబర్ 16న మృతి చెందిన తర్వాత ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తాజాగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో మహిళలపై ఆంక్షల విషయంలో ఇరాన్ మళ్లీ వార్తల్లో నిలిచింది.

Next Story

Most Viewed