పాకిస్థాన్‌పై ఎయిర్‌ స్ట్రైక్స్..ISIS నేతలు మృతి !

by velandi.Saikiran |

పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ పై దాడి చేసింది.

పాకిస్థాన్‌పై ఎయిర్‌ స్ట్రైక్స్..ISIS నేతలు మృతి !
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ పై దాడి చేసింది. పాకిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ - K స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ఫోర్సెస్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఖైబర్ పంఖ్తుఖ్వా, బలూచిస్తాన్ పైన డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఇక ఈ దాడి నేపథ్యంలో పలువురు ఐఎస్ఐఎస్ నేతలు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. ఇది ఇలా ఉండగా గత ఆదివారం తమ దేశం పై పాకిస్తాన్ జరిపిన స్ట్రైక్స్ కు ప్రతికారంగానే ఈ దాడులు జరిపినట్లు వెల్లడించింది. త‌మ జోలికి వ‌స్తే, ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. అటు ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడులను మన ఇండియా కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ వెనుక తాము ఉన్నామ‌ని మ‌రోసారి భార‌త స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది.

Next Story