"అద్వైతం - యోగా నృత్యం".. ప్రవేశం ఉచితం

by Muthe.Rajitha |

మహాత్మా గాంధీ మెమోరియల్ నార్త్ టెక్సాస్ (MGMNT) ఆధ్వర్యంలో జూలై 13న ఆదివారం సాయంత్రం లూయిస్‌విల్లేలో "అద్వైతం - యోగా నృత్యం" కార్యక్రమం జరగనుంది.

అద్వైతం - యోగా నృత్యం.. ప్రవేశం ఉచితం
X

దిశ, వెబ్ డెస్క్ : మహాత్మా గాంధీ మెమోరియల్ నార్త్ టెక్సాస్ (MGMNT) ఆధ్వర్యంలో జూలై 13న ఆదివారం సాయంత్రం లూయిస్‌విల్లేలో "అద్వైతం - యోగా నృత్యం" కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని DFW ల్యాండ్, భవ్య గ్రూప్స్ సమర్పిస్తుండగా.. ఫన్ ఆసియా, రేడియో సురభి ప్రమోట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళానికి చెందిన సంప్రదాయం కూచిపూడి గురుకులం ఈ నృత్యాన్ని నిర్వహిస్తోంది. స్వాతి సోమనాథ్ తో పాటు కొర్ర బల్‌రామ్, నిమ్మల అంజలి, పి. పద్మావతి కళాకారులుగా ఈ నృత్యాని ప్రదర్శిస్తున్నారు. యోగాతో కూడిన ఈ నృత్య ప్రదర్శన ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా జరుగుతోంది. కాగా ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆఫ్ నార్త్ టెక్సాస్, మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా మరియు అఖిల భారతీయ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ వంటి వివిధ సహాయక సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం.. డా. ప్రసాద్ థోటకూరా (817) 300-4747, రాజీవ్ కమత్ (214) 463-6326, రావు కల్వాల (732) 309-0621, తయ్యబ్ కుందావల (469) 733-0859, బి.ఎన్. రావు (469) 544-6395, రన్నా జాని (817) 690-3728, మహేందర్ రావు (214) 529-3257, రంఖీ చేబ్రోలు (214) 592-1432, మరియు రాజేంద్ర వంకవాలా (817) 896-7258 లను సంప్రదించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.

Next Story