- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ భూకంపంలో 622 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంబవించి.. 622 మంది మృతి చెందడంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం (huge earthquake) సంబవించి.. 622 మంది మృతి చెందారు. అలాగే 800 మంది స్థానిక ప్రజలు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. దీంతో భూకంప తీవ్రత ఏ మేరకు ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ విజువల్స్ ప్రకారం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భూకంపం ప్రభావిత గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్లు (Rescue operations) కొనసాగిస్తున్నారు.
ఈ విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) స్పందిస్తూ.. దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్లో "ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలతో మా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. బాధితులకు సాధ్యమైన అన్ని రకాల మానవతా సహాయం, సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది." అని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.






