వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

by  |
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
X

దిశ, మహబూబ్‌నగర్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ వడ దెబ్బ తగిలి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మిడ్జిల్ మండలం వాడియల్ గ్రామ నివాసి వడ్ల చంద్రమౌళి గురువారం ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా వడ దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు గమనించి వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రమౌళిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

Tags: worker, killed, sunstroke, Mahabubnagar



Next Story

Most Viewed