కొడుకు పోయాక కోడలిపై కన్నేసిన మామ.. నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని అలా..!

by  |
కొడుకు పోయాక కోడలిపై కన్నేసిన మామ.. నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని అలా..!
X

దిశ, సిరిసిల్ల : లైంగికంగా వేధిస్తున్నాడని నాలుగు రోజుల కిందట మామపై కోడలు ఫిర్యాదు చేసింది. అనంతరం అమ్మగారింటికి వెళ్లిపోయింది. అయితే, కట్టుబట్టలతో వెళ్లిన ఆమె అత్తగారింట్లో ఉన్న బట్టలు తీసుకొచ్చుకునేందుకు గురువారం అత్తగారింటికి వెళ్లింది.ఈ క్రమంలో మామ తరఫు బంధువులు వచ్చి మామపైనే ఫిర్యాదు చేస్తావా..? అంటూ కోడలిపై భౌతిక దాడికి దిగారు. కోడలితో వచ్చిన బంధువులు వారిపై ప్రతిదాడికి దిగారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెలరోజుల కిందట బాధితురాలి భర్త చనిపోయాడు.

అప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్న తనను మామ ఇబ్బంది పెడుతున్నాడని నాలుగు రోజుల కిందట కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్​స్టేషన్​ నుంచి నేరుగా తన అమ్మ వాళ్లింటికి వెళ్లిపోయింది. తన బట్టలు తీసుకొచ్చుకునేందుకు ఈరోజు అత్తగారింటికి వెళ్లింది. బాధితురాలి రాకను గమనించిన మామ తరఫు బంధువులు ఆమెను దూషించారు. పరస్పర దూషణలతో మొదలైన గొడవ భౌతిక దాడుల వరకు వెళ్లింది.ఇరువర్గాల మహిళలు జుట్టు పట్టుకుని నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగారు. ప్రధాన రహదారిపైనే గొడవ జరగటంతో స్థానికులు అందరూ తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. కోడలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కోసం పోలీసులు కూడా అదే సమయంలో రావటంతో ఈ దాడి వారి కంటపడింది. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిగపట్లతో మహిళలు కొట్టుకున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.



Next Story

Most Viewed