9 నెలల బిడ్డతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య.. కారణం అదేనా..?

by  |
9 నెలల బిడ్డతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య.. కారణం అదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తొమ్మిది నెలల పసి బిడ్డతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్‌ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలానికి చెందిన సరిత(20).. తన తొమ్మిది నెలల కూతరుతో సహా గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే, సరితను రెండు రోజుల క్రితమే ఆమె తల్లిదండ్రులు అత్తవారింటి నుంచి తమ ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. సరిత ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed