మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి

by  |
మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆత్మవిశ్వాసమే ఆలంభనగా మహిళలు ఎదగాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. టూరిజం ప్లాజాలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, మేయర్ గద్వాల విజయలక్ష్మీతో కలిసి మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్లుగా మహిళలకు అవకాశమిచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో అవకాశాల్ని సృష్టించుకుంటూ ప్రపంచం మనకు దారిచ్చేలా ఎదగాలని పిలుపునిచ్చారు. రాజకీయంగానూ, ఇతర రంగాల్లోనూ మహిళలకే తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed