అడవిలో మహిళ దారుణ హత్య..

by  |
అడవిలో మహిళ దారుణ హత్య..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గణపురం మండ‌ల‌ కేంద్రానికి చెందిన బండారు ఓదేలు తన భార్యను అటవీ ప్రాంతంలో కర్రతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులకు ప్రాథ‌మిక స‌మాచారం అందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed