బ్లాక్ ఫంగస్ కలకలం: మహిళ మృతి

by  |
బ్లాక్ ఫంగస్ కలకలం: మహిళ మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది, సోమవారం ఉదయం జిజిహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్‌తో మహిళ మృతి చెందింది. మృతురాలు నగరం లోని గౌతంనగర్ కు చెందిన మహిళ. 50 పడకలు ఉన్న బ్లాక్ ఫంగస్ వార్డులో మరో ఏడుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ప్రారంభించిన మరుసటి రోజే తొలి మరణం సంభవించడం కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ తో 7గురు మృతి చందారు. జిల్లాలో ఇప్పటి వరకు 35 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి.


Next Story