కరోనా పాజిటివ్.. షుగర్ లెవల్స్ పెరిగి మహిళ మృతి!

by  |
కరోనా పాజిటివ్.. షుగర్ లెవల్స్ పెరిగి మహిళ మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి విజృంభణ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొందరు పాజిటివ్ వచ్చి వైరస్ పోరాడి క్షేమంగా బయట పడుతుండగా, మరికొందరు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరైతే పాజిటివ్ వచ్చిందని తెలిసి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగుచూస్తున్నాయి. ఇంకొందరు పాజిటివ్ వచ్చిందనే షాక్‌లో అక్కడికక్కడే కుప్పకూలుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో గురువారం వెలుగుచూసింది. కొవిడ్ టెస్టు చేసించుకున్న మహిళకు పాజిటివ్ అని తేలడంతో షుగర్ లెవర్స్ బాగా పెరిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed