భోజనం చేస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలి!

by  |
భోజనం చేస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలి!
X

దిశ, నల్లగొండ: ఆమె ఓ కంపెనీలో పనిచేస్తోంది. రోజులాగానే పని చేసి మధ్యాహ్నం తోటి కార్మికులతో కలిసి భోజనం చేసిన చోటనే ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన బోగ ఉమ కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఆసుప్రతికి తరలించేలోపే చనిపోయింది. కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబానికి యాజమాన్యం రూ.10 లక్షల నష్టంపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

Next Story

Most Viewed