- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉసురుతీసిన అప్పులు
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: రోజూ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం ఆమెది. భర్త కల్లు గీత కార్మికుడు. వీరికి ఇద్దరు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతుర్ల పెళ్లిళ్ల కోసం సూమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. ఆమె కూలి డబ్బులు రోజువారి కుటుంబ ఖర్చులకే సరిపోతుంది. ఇక అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు. రోజురోజుకీ అప్పుల్లోల బాధలు ఎక్కువైయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ […]</p>

X
దిశ, మెదక్: రోజూ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం ఆమెది. భర్త కల్లు గీత కార్మికుడు. వీరికి ఇద్దరు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతుర్ల పెళ్లిళ్ల కోసం సూమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. ఆమె కూలి డబ్బులు రోజువారి కుటుంబ ఖర్చులకే సరిపోతుంది. ఇక అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు. రోజురోజుకీ అప్పుల్లోల బాధలు ఎక్కువైయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లంపల్లికి చెందిన బొమ్మగాని రాధమ్మ(55) అప్పుల బాధ భరించలేక ఈ నెల 23న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త రాజయ్య వచ్చి చూసే సరికి ఆమె నోటి నుంచి నురగ కారుతోంది. వెంటనే ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాధమ్మ ఆదివారం ఆసుపత్రిలోనే కన్నుమూసింది.
Next Story






