అయ్యో లావణ్య.. ఎంతపని చేశావమ్మా?

by  |

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాల్లగూడలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేష్-లావణ్యలు భార్యాభర్తలు. వెంకటేష్ పైలెట్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకటేష్ భార్య లావణ్య (28) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed