- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్స్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే పేషంట్లు సంబంధిత ఆసుపత్రిలో తమకు బెడ్ అలాట్ అయింది అనే టై అప్ సర్టిఫికెట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈ మేరకు సమాచారం అందించారు. దీంతో ఈరోజు నుంచి కొవిడ్ పేషంట్లను రాష్ట్రంలోనికి అనుమతించడం లేదు. కేవలం ఆసుపత్రితో టై అప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పుల్లూర్ చెక్ పోస్ట్ వద్ద కర్నూల్ నుంచి వచ్చే అంబులెన్స్లను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 20 నుంచి 30 అంబులెన్స్లను పోలీసులు నిలిపివేసారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషంట్ల అంటెండెంట్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. తమకు వైద్యం అందించాలని కోరింది.