బైవరెడ్లపల్లిలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

by  |
బైవరెడ్లపల్లిలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తన భూమిలో సర్వే నిర్వహిస్తున్న అధికారుల ముందే ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామకుప్పం మండలం బైవరెడ్లపల్లిలో ప్రభుత్వం భవనం కోసం ఓ మహిళకు చెందిన భూమిలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందే పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed