ప్రైవేట్ డాక్టర్ల నిర్వాకం.. కడుపులో అది మర్చిపోవడంతో మహిళ మృతి

by  |
ప్రైవేట్ డాక్టర్ల నిర్వాకం.. కడుపులో అది మర్చిపోవడంతో మహిళ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరిలో ప్రైవేట్ డాక్టర్ల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. ఏడాది క్రితం డెలివరీకి వచ్చిన మహిళకు కేకే ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో వారికి తెలియకుండా కడుపులో కాటన్ పెట్టి మర్చిపోయారు వైద్యులు. ఆరు నెలలుగా మహిళ తీవ్ర అనారోగ్యంపాలుకావడం.. విపరీతంగా కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అయితే భువనగిరి ఆసుపత్రి వైద్యులు కడుపులో కాటన్ మర్చిపోవడంతో అది పాయిజన్‌గా మారి మహిళ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో భువనగిరి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేకే ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed