- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ నిర్ణయాలతో ఏపీలో చీకటి రోజులు: బైరెడ్డి
by Ramesh Goud |
<p> సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్కు చీకటి రోజులు వచ్చాయని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ,ఇతర రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నిస్తూంటే జగన్ మాత్రం ఉన్న కంపెనీలను వెళ్లగొడుతున్నాడని ఆరోపించారు. 370 అధికరణ రద్దుకు ముందు జమ్ము కశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదనీ, ఆ అధికరణ రద్దు తర్వాత పరిస్థితి మారిందన్నారు. మొన్నటివరకు బీహార్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడేవారనీ, […]</p>

X
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్కు చీకటి రోజులు వచ్చాయని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ,ఇతర రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నిస్తూంటే జగన్ మాత్రం ఉన్న కంపెనీలను వెళ్లగొడుతున్నాడని ఆరోపించారు. 370 అధికరణ రద్దుకు ముందు జమ్ము కశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదనీ, ఆ అధికరణ రద్దు తర్వాత పరిస్థితి మారిందన్నారు. మొన్నటివరకు బీహార్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడేవారనీ, ఏపీ అంతకంటే దారుణంగా తయారైందని ఆరోపించారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటే చాలన్నట్లు వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని చెప్పారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోడీ ఒకసారి సమీక్షించాలని కోరతానని ఆయన తెలిపారు.
Next Story






