20 రోజుల్లోనే ముగ్గురి మృతి..కారణం ఇదే!

by  |
20 రోజుల్లోనే ముగ్గురి మృతి..కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు పలువురి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా సోకి మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

వివరాల్లోకివెళితే.. జిల్లాలోని ప్రముఖ వ్యాపారి ఇంట్లో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. వీరంతా చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తండ్రి, ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాధిత కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న వ్యాపార సంఘాలు వారి కుటుంబానికి సంతాపం ప్రకటించాయి.



Next Story

Most Viewed