డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతో తెలుసా?

by  |
డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ తొలి సారిగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో విజేత జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు (రూ. 11.5 కోట్లు) ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ సీఈవో జెఫ్ అలర్డైస్ ప్రకటించారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 80 వేల డాలర్లు (రూ. 6 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఒక వేళ మ్యాచ్ డ్రా అయితే మొత్తం ప్రైజ్ మనీని ఇరు జట్ల మధ్య పంచనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రైజ్ మనీని ఇరు జట్లలోని ఆటగాళ్లకు ఆయా క్రికెట్ బోర్డులు పంచుతాయి. దీంతో పాటు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఇచ్చే టెస్ట్ చాంపియన్‌షిప్ గదను కూడా బహుకరించనున్నారు.

Next Story

Most Viewed