- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భువనగిరి రూరల్ : గడువు ముగిసిన బీర్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వైన్ షాప్ నిర్వహకులు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని న్యూ మత్స్యగిరి వైన్స్లో కొనుగోలు చేసిన బీరు తాగి ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం రాత్రి రాజు అనే వ్యక్తి బడ్ వైజర్ బీరు కొనుగోలు చేసి, దానిని కొంచెం తాగగానే వాంతులు అయ్యాయి.
వెంటనే బీరుపై గడువు తేదీ చూడగా ఎక్స్పైర్ డేట్ దాటి ఉంది. దీంతో కాలం ముగిసిన బీర్లు అమ్ముతున్నారని వెంటనే న్యూ మత్స్యగిరి వైన్స్ వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. వారి వద్ద నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో వెంటనే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్పందించిన ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ వెంటనే వైన్స్ వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. వైన్స్లో ఎక్స్పైర్ డేట్ దాటిన 16 బీర్లను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం వాటిని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు.