మద్యం షాపు వాచ్‌మెన్ ఆత్మహత్య

by  |

అమరావతి: మద్యం షాపు వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ వైన్ షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. వాచ్‌మెన్ మద్దాల కోటేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో వారు ఆయనపై దాడి చేసి మద్యాన్ని తీసుకెళ్లారు. దాడితో తీవ్ర మనస్తాపం చెందిన వాచ్‌మెన్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపడతామని పోలీసులు హామీనివ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించుకున్నారు.

Tags: watch man sucide, wine shope, krishna, crime

Next Story

Most Viewed