- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమరావతి: మద్యం షాపు వాచ్మెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ వైన్ షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. వాచ్మెన్ మద్దాల కోటేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో వారు ఆయనపై దాడి చేసి మద్యాన్ని తీసుకెళ్లారు. దాడితో తీవ్ర మనస్తాపం చెందిన వాచ్మెన్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపడతామని పోలీసులు హామీనివ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించుకున్నారు.
Tags: watch man sucide, wine shope, krishna, crime
Next Story