ఓ వైపు భర్త.. మరోవైపు ప్రియుడు.. చివరకు లవర్ తమ్ముడితో కలిసి..

by  |
ఓ వైపు భర్త.. మరోవైపు ప్రియుడు.. చివరకు లవర్ తమ్ముడితో కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనే బంధానికి మహిళలు ఎంతో గౌరవం ఇస్తారు. భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఓ మహిళ పెళ్లి అనే పదాన్ని అపహాస్యం చేసి.. ప్రియుడితో ఎఫైర్ సాగిస్తూనే.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కట్టకున్న భర్తను సైతం నట్టేట ముంచి ప్రియుడితో రాసలీలలకు దిగింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలోని గాజువాకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

గాజువాక ప్రాంతానికి చెందిన రేణుక‌ను జగదీష్ అనే వ్యక్తికి ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. అయితే పెళ్లైన మూడు రోజులకే రేణుక గర్భవతి అని తెలియడంతో భర్త జగదీష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో ఆమెను వదిలేశాడు.

క్యాబ్స్‌లో రాసలీలలు.. డ్రైవర్లు ఎలా చేస్తున్నారంటే..?

అప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తిని రేణుక ప్రేమించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ శారీరకంగా హద్దులు దాటడంతో గర్భం దాల్చింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో రేణుక ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి వరకూ అంతా బాగానే ఉన్నా.. శ్రీనివాస్‌కు అతడి తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు.

విషయం తెలుసుకున్న రేణుక.. శ్రీనివాస్‌ను నిలదీయడంతో పాప బాధ్యత తాను తీసుకుంటానని బ్యాంకులో కొంత డబ్బు కూడా డిపాజిట్ చేస్తానని అప్పటికి గండం నుంచి తప్పించుకున్నాడు. పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

కానీ రేణుక మాత్రం శ్రీనివాస్‌ను వదలలేదు. దీంతో రేణుకను ఎలా అయినా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. వెంటనే ఆమెను కూర్చొబెట్టి తన ప్లాన్ వివరించాడు. శ్రీనివాస్ పిన్ని కొడుకైన ప్రసాద్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడని.. అతడిని లైన్‌లో పెట్టి పెళ్లి చేసుకోమని ఉచిత సలహా అందించాడు. అతడి ఫోటోలు, ఫోన్ నెంబర్ రేణుకకు ఇచ్చాడు. ప్రియుడు చెప్పిన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసిన రేణుక.. ప్రసాద్‌ను ముగ్గులోకి దించింది.

సీక్రెట్‌గా ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఆర్మీ ఉద్యోగం కారణంగా లక్నోలో ఉంటున్న ప్రసాద్ తన వెంటే భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు లక్షలు విలువ చేసే బంగారం కొనిచ్చాడు. ఎంతో బాగా చూసుకున్నాడు. కానీ, కొంతకాలం తర్వాత జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందని ప్రసాద్‌ను నమ్మించిన రేణుక వైజాగ్ వచ్చి మళ్లీ ప్రియుడు శ్రీనివాస్‌తో సెటిలైంది. ప్రసాద్ ఆర్మీలో సెలవులు లేకపోవడంతో ఉండటంతో విశాఖకు రాలేకపోయాడు.

ఇదే అదునుగా భావించిన రేణుక.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని తరచూ భర్త నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. అలా చికిత్సల పేరుతో మొత్తం 45 లక్షల వరకు లాగేసింది. చివరకు అమ్మ చనిపోయిందంటూ ప్రసాద్‌ను నమ్మించింది. ఈ క్రమంలోనే రేణుకకు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుడు పరిచయం అయ్యాడు.

చివరకు రేణుక సాయిని కూడా పెళ్లి చేసుకుంది. ఎలాగోలా రేణుక గురించి అసలు విషయం తెలుసుకున్న భర్త ప్రసాద్ గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. రేణుకపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గాజువాక పోలీసులు తెలిపారు.

https://www.facebook.com/Dishacinema

ఇవి కూడా చదవండి:

టీచర్ పై ఐదేళ్లుగా అత్యాచారం.. ఇంకా కోరిక తీరలేదంటూ నగ్న వీడియోలతో..

అతడికి 64, ఆమెకు 55.. పైశాచికత్వంతో ఆమె ప్రైవేటు పార్ట్స్‌పై..

మేనల్లుడి భార్యతో మామ ఎఫైర్.. ఇంట్లోనుంచి పారిపోయి అక్కడ, అలా దొరికి



Next Story

Most Viewed