ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

by  |
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
X

దిశ, వెబ్‎డెస్క్: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన హైదరాబాద్‎లోని చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె కొన్నాళ్లుగా షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వీరి విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.

ఈ నెల 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న భర్త ముఖంపై ప్రియుడు సహాయంతో దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం అత్తమామల దగ్గరికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ కుమారుడిని కొట్టడంతో చనిపోయాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం చేసినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెతో పాటు షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed